Sunday, May 12, 2024
- Advertisement -

తొలి ముద్దు అత‌నితోనే షేర్ చేసుకుంటా – జాన్వీ క‌పూర్‌

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ధ‌డ‌క్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సినిమాలో జాన్వీ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. దీంతో బాలీవుడ్‌లో జాన్వీకి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే ‘తక్త్’ అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. జాన్వీ తాజాగా నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న ‘బీఎఫ్ విత్ వోగ్స‌ షో గెస్ట్‌గా వెళ్లింది. ఈ సంద‌ర్భంగా త‌న సినిమా విశేషాల‌తో పాటు నేహా ధూపియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది జాన్వీ.

ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని నేహా ధూపియా. దీనికి ఏమాత్రం మొహామాటం లేకుండా విక్కీ కౌశల్ చెప్పింది జాన్వీ. త‌న‌కు అవ‌కాశం వ‌స్తే విక్కీ కౌశల్‌తో త‌న తొలి ముద్దును అత‌నితోనే షేర్ చేసుకుంటాన‌ని తెలిపింది. ‘ఉరి’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న విక్కీ కౌశల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్ర‌స్తుతం విక్కీ కౌశల్‌తో క‌లిసి ‘తక్త్’ సినిమాలో న‌టిస్తుంది జాన్వీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -