పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాలార్, ప్రాజెక్ట్-కె మరియు మారుతి మూవీ – రాజా డీలక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం అభిమానులే కాకుండా ఇతర ప్రేక్షకులకు కూడా చాలా ఎదురుచూస్తున్నారు. మేకింగ్లో ప్రతి చిన్న విషయాలపై చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుండడంతో షూటింగ్కి సమయం పడుతుంది. ఇదిలాఉంటే అభిమానులకు మరో అదిరిపోయే వార్త కూడా బయటకు వచ్చింది.
గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ ప్రభాస్తో జతకట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కెలో విలన్ పాత్ర చేయడానికి కమల్ హాసన్ ఓకే చెప్పినట్లు అంతర్గత సమాచారం. ఈ సినిమా కోసం కమల్ హాసన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ను అందుకుంటున్నారట. ఇదే జరిగితే ఈ సినిమా అతిపెద్ద మల్టీస్టారర్గా మారనుంది.
Also Read: అసంతృప్తిలో మెగా ఫ్యాన్స్…
ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ 70% పూర్తయిందని, ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కావడానికి ప్రయత్నలు చేస్తున్నట్టు గతంలో మేకర్స్ తెలియజేశారు. ప్రాజెక్ట్ కె జనవరి 12, 2024న విడుదలవుతుందని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చినప్పటికీ, ఇటీవలే ఈ సినిమా వాయిదా పడుతుందని పుకార్లు వచ్చాయి. అయితే, అదే తేదీన సినిమాను డుదలకు సిద్ధమవుతుందని, సీక్వెల్ గురించి క్లారిటీ రాలేదని నిర్మాతలు పేర్కొన్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ సారథ్యంలోని ఈ మాస్టర్ పీస్లో ప్రభాస్తో పాటు దీపికా పదుకొణె, బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
Also Read: అక్కినేని హీరోలు సినిమాలకు కాస్త విరామం..?