Friday, May 3, 2024
- Advertisement -

‘చీకటి రాజ్యం’లో ఉత్తమ విలన్!

- Advertisement -

తమిళనాడు వర్షాలు.. మామూలు ప్రజలకే కాదు.. సెలెబ్రిటీలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. బీభత్సంగా మారిపోయిన చెన్నైని చూసి ఆవేదనతో జయ సర్కార్ ను ప్రశ్నించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూ… చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

చెన్నై ఇంత అధ్వానంగా తయారైంది.. మేం కడుతున్న పన్నులు ఏం చేస్తున్నారు.. మామూలు ప్రజల సౌకర్యాల గురించి పట్టదా అంటూ రీసెంట్ గా.. జయ ప్రభుత్వంపై కమల్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఒక్క క్షణం వెయిట్ చేయకుండా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులు.. కమల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇప్పుడు తమిళ ప్రభుత్వ అధికారులు కూడా కమల్ వెంట పడుతున్నారు. ఆయన ఇంటికి కరెంట్ కట్ చేశారు. పేరుకు వరదల ప్రభావంతో విద్యుత్ లైన్ల రిపేర్లే.. కమల్ ఇంటికి కరెంట్ కట్ కు కారణమని చెబుతున్నా… అసలు కారణం మాత్రం వేరే ఉందని కొందరంటున్నారు.

జయలలితపై చేసిన కామెంట్ల ఫలితమే.. ఆయన ఇంటికి కరెంట్ కట్ అయ్యేలా చేసిందని కమల్ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ తన కామెంట్లపై వివరణ ఇచ్చినా… ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ.. ఎవరెంత విమర్శించినా.. మన ఉత్తమ్ విలన్ కు.. ఇప్పుడు చీకటి రాజ్యమే మిగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -