Sunday, May 19, 2024
- Advertisement -

రామ్ చరణ్ కోసం కంచె ఆడియో వేడుకను షిఫ్ట్ చేశారు!

- Advertisement -

మొదటగా ‘కంచె’ సినిమా ఆడియోను విశాఖ వేదికగా విడుదల చేద్దామని భావించారు. వరుణ్ తేజ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అనేక రకాలుగా ఆసక్తిని రేకెత్తించింది.

ఇది వరకూ గమ్యం, కృష్ణంవందే జగద్గురం వంటి సినిమాలను రూపొందించిన క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు కావడం ఆసక్తికరమైన అంశం అయ్యింది. అలాగే ఇది రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి సినిమా కావడం మరింత ఆసక్తికరమైన అంశం. ఇలాంటి నేపథ్యంలో ఈ వినాయక చవితి సందర్భంగా విశాఖలో ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని భావించారు.

సెప్టెంబర్ 17న ఆడియో విడుదలకు అంతా సిద్ధం అనుకొంటున్న తరుణంలో ఆ వేదిక హఠాత్తుగా మారింది. దీన్ని హైదరాబాద్ కు మార్చారు. మరి ఇలా వేదిక మారడం వెనుక ఆసక్తికరమైన రీజనే ఉన్నట్టుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కోసమే ఈ మార్పు చేసినట్టుగా సమాచారం. చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. అందుకోసమే కార్యక్రమాన్ని వైజాగ్ నుంచి హైదరాబాద్ వేదికగా నిర్వహించడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి తమ్ముడి సినిమాకు ఈ విధంగా చరణ్ ఆడియోను ఆవిష్కరించి బెస్టాఫ్ లక్ చెప్పబోతున్నాడనమాట. ఇది మెగాభిమానులకు శుభవార్తే.. కంచె సినిమాపై వారిలో ఆసక్తిని పెంచే అంశమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -