Sunday, April 28, 2024
- Advertisement -

ఉత్కంఠ రేపుతున్న ‘క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి’ట్రైల‌ర్

- Advertisement -

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాల జోరు పెరుగుతుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిన్న చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెరైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. విజ‌య్ శంక‌ర్, సంప‌త్ కుమార్, చందులాల్,మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో క్రాంతి సైన తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’.

మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ లు సహా నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

లాక్‌డౌన్ త‌ర్వాత చిత్ర విడుద‌ల‌కు ప్లాన్ చేస్తుండ‌గా మూవీ ట్రైల‌ర్ అశ్వినీద‌త్ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. ఈ సందర్భంగ ఆయ‌న మాట్లాడుతూ… ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ట్రైల‌ర్ బాగుంద‌ని, సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -