తమిళ హీరో కార్తి ఎప్పుడు కూల్గా ఉంటాడు. కార్తి కోపంగా ఉండటాన్ని మనం ఎప్పుడు చూసి ఉండం. కాని ఓ సినిమా ఫంక్షన్కు గెస్ట్గా వచ్చిన కార్తి కాస్తా కోపానికి గురి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… సోమవారం తమిళ సినిమా ‘జులై కాట్రిల్’ అనే సినిమా ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా వచ్చాడు కార్తీ. ఈ కార్యక్రమానికి సినీ నటి కస్తూరి యాంకర్గా వ్యవహారించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పని కార్తికి కోపం తెప్పిచింది.కార్తిని సెల్ఫీ కావాలని అడుగుతూ పరోక్షంగా ఆయన తండ్రి శివకుమార్ను టార్గెట్ చేసినట్లు మాట్లాడారు.
సెల్ఫీ దిగాడానికి మీ నాన్నగారు లేకు కదా ఏం పర్లేదు రండీ ఫోటో దిగుదాం అంటూ ఆయన తండ్రిని కించపరిచేలా మాట్లాడింది. కస్తూరి మాట్లాడిన మాటలకు కార్తికి మండిపోయింది. నేరుగా స్టేజీపపైనే కస్తూరికి కౌంటర్ ఇచ్చాడు.అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదు. ఫోన్ నుంచి వెలువడే ఫ్లాష్లైట్ వల్ల మైగ్రేన్ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి’ అని చెప్పి కార్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో కార్తి వాళ్ల నాన్నగారు శివకుమార్ ఓ అభిమాని ఫోటో దిగడానికి వస్తే ,ఆ అభిమాని ఫోన్ను పగలుగొట్టారు. దీని ఉద్దేశంతోనే కస్తూరి అలా మాట్లాడిందని చాలామంది చర్చించుకుంటున్నారు.
- Advertisement -
హీరో కార్తికి మండింది…నటి కస్తూరిపై రెచ్చిపోయాడు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -