సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మెగా బ్రదర్ నాగ బాబుపై ఫైర్ అయ్యారు.కత్తి మహేష్ తాజాగా హిందుమతంపై చేసిన కామెంట్స్కు వ్యతిరేకంగా ఆయనపై హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో కత్తి మహేష్ ను అరెస్ట్ చేయడం విచారించి కొన్ని హామీల మీద విడిచిపెట్టడం జరిగింది.కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.కత్తి మహేష్ ను కఠినంగా శిక్షించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కత్తి మహేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనపై విమర్శలు గుప్పించిన నాగబాబుపై మండిపడ్డాడు. నాగబాబు గారు జబర్దస్త్ లో జడ్జిగాకన్నా పార్టిసిపెంట్ గా ఉంటే ఇంకా బాగుండేదని కామెంట్ చేశాడు కత్తి మహేష్ . ముందు మీది మీరు చూసుకోండి అంటు నాగబాబుని హెచ్చరించారు.తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక బూతులు లైవ్ డిబేట్స్ లో తిని, ఇప్పటికి కూడా ఒక్క బూతు వాడని మనిషిని నేనంటు కితాబు ఇచ్చుకున్నాడు కత్తి మహేష్.