“నేను శైలజ” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఈ భామ తమిళంలో బాగా బిజీ కావడంతో.. తెలుగులో సినిమా చేయలేకపోయింది. ఈ భామ నటించిన రెమో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. త్వరలో నాని తో “నేను లోకల్” సినిమా తో రానుంది. యువ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన చాన్స్ అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ల కు పోటీ ఇవ్వడానికి సిద్దమైంది కీర్తి సురేష్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన హీరోయిన్ గా నటించనుంది.
హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. ధృవ తర్వాత రామ్ చరణ్ తేజ్, సుకుమార్ డైరక్షన్లో చేయనున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తిని అనుకుంటున్నారు. ఆమె డేట్స్ అనుకూలంగా ఉంటే… ఫిక్స్ చేయాలనీ సుకుమార్ చూస్తున్నాడట. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఆమె వెనుక పడ్డారు.
Related