Thursday, May 2, 2024
- Advertisement -

కీర్తి సురేష్ ని చూసి వర్రీ అవుతున్న ఫాన్స్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర కథానాయికల్లో ఒకరు కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత తెలుగు లో ఒకేసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించుకుంది కీర్తి. ప్రస్తుతం తెలుగు లో మూడు సినిమాల తో బిజీ గా గడుపుతుంది. ఒకటి నరేంద్ర దర్శకత్వం లో షూటింగ్ జరుగుతుండగా, ఒకటి నగేష్ కుకునూర్ దర్శకత్వం లో మొదలు కానుంది, ఇక మూడోది నాగార్జున ప్రధాన పాత్ర లో వస్తున్న మన్మధుడు 2.

అయితే సడన్ గా కీర్తి సురేష్ బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకేసారి బరువు తగ్గడం తో కీర్తి ని ఎవరూ గుర్తు పట్టలేకున్నారు. అయితే కీర్తి ముందు నుండి ఒక ప్రణాళిక తో నే బరువు తగ్గి ఒక ఫీజికల్ ట్రాన్సఫార్మేషన్ కోరుకుంది అంట. అందుకే క్రమక్రమం గా తన ఆహార, వ్యాయామాల్లో మార్పులు చేసుకుంటూ తాను అనుకున్న లుక్ కి చేరింది.

కాకపోతే అభిమానులే ఈ విషయం లో కొంత భయపడుతున్నారు. ఒకేసారి బరువు తగ్గడం, అస్సలు గుర్తు పత్తాలేకుండా కీర్తి మారిపోవడం తో ఇప్పుడు తన మొహం లో ఉన్న గ్లో అంతా మాయం అవ్వడం తో కీర్తి కి అవకాశాలు వస్తాయా, అలాగే ఇప్పుడు చేస్తున్న సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆందోళన ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -