Tuesday, May 7, 2024
- Advertisement -

దర్శకుడి మీద కర్చీఫ్ వేసిన నిర్మాతలు..!

- Advertisement -

కేజీఎఫ్ సినిమా ని దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ మీద ప్రస్తుతం అందరి నిర్మాతల చూపు ఉంది. సినిమా కి సంబంధించి మొదటి భాగం పెద్ద విలయం సాధించింది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు రెండో భాగం పై తమ పూర్తి ధ్యాస ని పెట్టారు. ప్రశాంత్ నీల్ కి ముందు నుండు కన్నడ లో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ సడన్ గా ఈ సినిమా విజయం సాధించడం తో అతని క్రేజ్ ఇప్పుడు అంతటా వ్యాపించింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనీ ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ దర్శకుడి మీద కర్చీఫ్ వేసేసారు ఈ దర్శకుడి జోలికి వస్తే ఊరుకొనేది లేని అనే విధం గా తమ వ్యూహాన్ని అమల చేసారు వీరు.

అయితే నిన్న పుట్టిన రోజు జరుపుకున్న ఈ దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలని పెద్ద ఎత్తున పేపర్ లో ప్రకటనలు ఇచ్చారు. ఇలాగ వారు ఇప్పటి దాకా ఒక తెలుగు దర్శకుడికి చేసినట్టు మనం ఎక్కడా చూడలేదు. అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండో భాగం పూర్తి చేస్తే కానీ ఇంకో సినిమా చేయడానికి కుదరదు. అందుకే ఆ రెండో భాగం పూర్తి అయ్యాక దర్శకుడు తమ బానర్ లో నే సినిమా చేస్తున్నాడు అనే విషయాన్నీ ఇలా స్పష్టం చేస్తున్నారు నిర్మాతలు.

అయితే ప్రశాంత్ ఎంత వరకు దీనికి ఒప్పుకుంటాడు అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -