అర్జున్ రెడ్డి తెలుగు సినిమా దిశ,దశ మార్చేసిన సినిమా.తెలుగు ఇండస్ట్రీలో శివ తరువాత ఓ ట్రెండ్ను క్రియేట్ చేసింది అర్జున్ రెడ్డి.తాజాగా ఈ సినిమాను తమిళ,హిందీ భాషలలో తరకెక్కిస్తున్నారు. తెలుగులో దర్శకతం వహించిన సందీప్ రెడ్డి వంగానే బాలీవుడ్ అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తుండగా హీరోయిన్గా మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమా హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది.
సినిమాలో రొమాంటిక్స్ సీన్స్ ఎక్కువుగా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా సినిమాలోని ఓ పోస్టర్ని విడుదల చేశారు.ఈ పోస్టర్ను చూస్తుంటేనే అర్థం అవుతుంది సినిమాలో వీరిద్దరు ఎలా రెచ్చిపోయి నటించారో.కియారా అద్వానికి ‘లస్ట్ స్టోరీస్’ అనుభవం ఉంది కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ లో కిస్సుల ఫెస్టివల్ చేపట్టడం ఖాయం. మరి తెలుగులో బ్లాక్ బాస్టర్ కొట్టిన ఈ సినిమా బాలీవుడ్లో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.