కైరా అద్వానీ అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. ఈ భామకు భరత్ అనే నేను సినిమాతో తెలుగులో వరస అవకాశాలు వస్తున్నాయి.అయితే తాజాగా ఓ బయోపిక్లో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.ర్గిల్ యుద్ధంలో శత్రుదేశంతో వీరోచితంగా పోరాడి అమరవీరుడైన ఆర్మీ అధికారి విక్రమ్ బత్రా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
విక్రమ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం పరమ వీర చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ పాత్రలో నటుడు సిద్దార్థ్ మల్హోత్రా నటించనున్నాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందననున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతకముందు క్రికెటర్ ధోని జీవిత కథలో కూడా హీరోయిన్గా నటించింది కైరా.ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్-బోయపాటి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది కైరా అద్వానీ.