టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటించిన చిత్రాలు తక్కువే అయిన అన్నీ బాక్సాఫీస్ షేక్ చేసినవే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. అప్పట్లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది.
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది.
ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు పెరుగుతున్నాయి. శంకర్, చరణ్ కలయికలో వచ్చే చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు.. కీలక నిర్ణయం..!