Thursday, March 28, 2024
- Advertisement -

‘క్రాక్’ మూవీ విడుదలకు బ్రేక్.. ఆగ్రహంలో అభిమానులు!

- Advertisement -

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 9న అంటే ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న క్రాక్ సినిమా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు బకాయిలను క్లియర్ చేయకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా కోర్టును ఆశ్రయించింది.

సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు. రవితేజ సరసన హీరోయిన్ గా శ్రుతీ హాసన్ నటిస్తోంది. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ తెలుగు సినిమాలో నటిస్తుంది. నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా థియేటర్లో బ్రేక్ పడటంతో రవితేజ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మధ్యాహ్నం కూడా షోలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మార్నింగ్ షో టికెట్లు బుక్ చేసుకున్నవారికి “క్రాక్” ప్రదర్శన లేదని మెసేజ్ లు వస్తున్నాయి. డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కాంబోలో వస్తునన్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -