వరుస పరాజయాలతో ఉన్న కృష్ణవంశీ ఈసారి మల్టీస్టారర్ సినిమాతో వచ్చి హిట్ కొడతానని ధీమాలో ఉన్నాడు. అందుకనుగుణంగా కథను సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఈసారి ఇద్దరు, ముగ్గురు హీరోలతో వస్తానంటున్నాడు కృష్ణవంశీ. చాన్నాళ్ల తర్వాత ‘నక్షత్రం’ సినిమాతో వచ్చి ఊహించని పరిణామం ఎదుర్కొన్నాడు. ‘చందమామ’ తర్వాత సరైన విజయవం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త సినిమాతో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రానా, మాధవన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి వస్తున్న ప్రముఖ తమిళ నటుడు మాధవన్కు ఈపాటికే కథ వినిపించినట్లు సమాచారం. మాధవన్ ఈపాటికే ఒకే చెప్పాడని ఇక దగ్గుబాటి రానాను కూడా కలవనున్నట్లు టాక్. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాను నిర్మిస్తారంట. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాధవన్ ‘సవ్యసాచి’ సినిమాలో నాగచైతన్య పక్కన నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాధవన్ కృష్ణవంశీ సినిమాలో నటించనున్నారని సమాచారం.