Friday, May 3, 2024
- Advertisement -

బంపర్ ఆఫ‌ర్ కొట్టేసిన ముద్దుగుమ్మ

- Advertisement -

టాలీవుడ్ లోనై బాలీవుడ్ లోనైనా బయో పిక్ లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. తాజాగా మరో సీనియర్ నటి జీవిత గాథను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లెజెండరీ నటి మీనా కుమారి బయోపిక్ ను తీసేందుకు టీ సిరీస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సినిమా టైటిల్ రోల్ కోసం అందాల భామ కృతి సనన్ ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినీ రంగంలో స్వశక్తితో ఎదిగిన తారల్లో కృతి సనన్ ఒక‌రు. హీరో పంటి చిత్రంతో నటిగా మారిన కృతి టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో అలరించింది.

వన్: నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాలతో ప్రే క్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. బాలీవుడ్ నుంచి వ‌రుసగా అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డ స్థిర ప‌డింది. తాజాగా లెజండ‌రీ న‌టి మీనా కుమారి బ‌యోపిక్ అవ‌కాశం రావ‌డంతో ఆమె పుల్ ఖుషీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఇంకా త‌న అంగీకారాన్ని తెల‌ప‌లేద‌ట‌. తాజా కృతి ‘బచ్చన్ పాండే’ సినిమాలో నటించింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందింది.

ఈ జ‌గ‌ర్తాండ సినిమానే తెలుగులో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ గా రీమేక్ చేశారు. ‘బచ్చన్ పాండే’లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ ప్ర‌ధాన‌ పాత్రలు పోషించారు. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్’లోనూ కృతి సనన్ నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -