Thursday, May 2, 2024
- Advertisement -

మహేష్ బాబు కోసం కొండారెడ్డి సెట్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లోని ఒక సన్నివేశం లో కర్నూల్ లోని పాప్యులర్ కొండారెడ్డి బురుజు ని చూపించబోతున్నారు. కానీ సరిలేరు నీకెవ్వరు టీం కి అక్కడ షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. చిన్న హీరో అయితే పర్వాలేదు కానీ మహేష్ బాబు కర్నూల్ కి వస్తున్నారంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందుకే చిత్రబృందం హైదరాబాద్ లోనే కొండారెడ్డి బురుజు సెట్ నిర్మించనుంది. ఇప్పటికే దాని తాలూకు పనులను మొదలు పెట్టేశారు. కొండారెడ్డి బురుజు మాత్రమే కాకుండా కర్నూల్ సెంటర్ లో ఉండే బిజీ రోడ్స్ కూడా సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన సెట్ లో మహేష్ బాబు మరియు విజయశాంతి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు మరియు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -