Friday, May 10, 2024
- Advertisement -

అజ్ఞాత‌వాసికి కుష్బూ థ్యాంక్స్‌

- Advertisement -
  • ప‌వ‌న్ సినిమాలో కీల‌క పాత్ర‌

స్టాలిన్ సినిమా త‌ర్వాత తెలుగులో కుష్బూ ఏ సినిమాలు చేయ‌లేదు. చాన్నాళ్ల త‌ర్వాత ఆమె ప‌వ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న ‘అజ్ఞాతవాసి’లో కీల‌క పాత్ర‌కు ఎంపిక‌య్యింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాకు ఆమె ప్ల‌స్ పాయింట్ కానుందని టాక్‌. ఈ విష‌యం కుష్బూ చెప్పేంత‌వ‌ర‌కు తాను న‌టిస్తున్న‌ట్లు ఎవ‌రికీ తెలియ‌దు.

తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్త‌య్యింద‌ని ఖుష్బూ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి తెలిపింది. యూనిట్‌ సభ్యులను విడిచి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. త్రివిక్రమ్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘కొందరిని విడిచి వెళ్తూ గుడ్‌ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటి వారే ‘అజ్ఞాతవాసి’ యూనిట్‌ సభ్యులు. నా చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నా. ఇంత మంచి వ్యక్తులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్లు చెమర్చాయి. డీఓపీ మణికందన్‌ ప్రియమైన వ్యక్తి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -