పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫర్. ఎలాంటి అంచనాలు లేకుండా 2019లో పొలిటికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. ముఖ్యంగా పృథ్వీరాజ్ దర్శకత్వం, మోహన్ లాల్ నటన, కథ ఇలా అన్ని కలిసి సినిమా హిట్ అవ్వడానికి దోహదపడ్డాయి. ఇక ఈ సినిమా రిలీజైన మూడేళ్ల నాలుగేళ్ల తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించగా అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.
ఇక లూసిఫర్ సక్సెస్ అప్పుడే పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు పృథ్వీరాజ్. అందుకు తగ్గట్టుగానే ఇవాళ పార్ట్ 2 పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు పృథ్వీ. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
అయితే ఈసారి లూసిఫర్ 2ను మలయాళంతో పాటు తెలుగు, కన్నడ,తమిళ్,హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీంతో తెలుగులో లూసిఫర్ 2 రీమేక్కు అవకాశం లేకుండా పోయింది. డైరెక్ట్గా రిలీజ్ చేస్తుండటంతో చిరు అభిమానులను కాస్త నిరాశపర్చిన ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సెకండ్ పార్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దక్షిణాది భాషలకు చెందిన ప్రముఖులు ఇందులో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.