Sunday, May 12, 2024
- Advertisement -

ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ కుమార్తె

- Advertisement -

ప్రముఖ హాస్య నటుడు, తాగుబోతు క్యారెక్టర్లలో ఒదిగిపోయి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎం.ఎస్.నారాయణ హఠాత్తుగా మందు మానేయడం వల్లే మరణించారా. అవునని ఆయన కుమార్తె, దర్శకురాలు ఎం.ఎస్ శశికిరణ్ చెబుతోంది.

ఈ మధ్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశికిరణ్ మాట్లాడుతూ మందు తాగుతున్నంత వరకూ తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, హఠాత్తుగా ఒకేసారి మందు మానేయడంతో మరణించారని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అలవాటు ఒక్కసారిగా వదిలేయడంతో ఎంఎస్ శరీరం తట్టుకోలేకపోయిందని ఆమె చెప్పారు.

తన తండ్రి మందు తాగడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదని, ఎంతో కష్టపడే నాన్నకు మందు ఓ ఆలంబన అయ్యిందని, దీనికి తోడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవడం వల్ల కూడా ఆయన మందుకు అలవాటు పడ్డారని శశికిరణ్ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -