- Advertisement -
అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహనటిగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
సమంత .. షాలినీ పాండే .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ వంటి యువ నటీనటులు, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది.