Saturday, April 27, 2024
- Advertisement -

మరో మహిళా ఓరియెంటెడ్ సినిమాలో కీర్తి సురేష్

- Advertisement -

నటి కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి, 2013లో మలయాళ సినిమా గీతాంజలితో నటిగా రంగప్రవేశం చేసింది. కీర్తి సురేష్ తల్లి మేనక కూడా సినినటి. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా నానితో దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ మూవీ భోళాశంకరలో కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

2018లో వచ్చిన మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నటిగా కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన మహిళా ఓరియెంటెడ్ సినిమాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, OTT లో వచ్చిన గుడ్ లక్ సఖి సినిమాలకు ఆశించిన రీతిలో స్పందన రాలేదు. ఆ తర్వాత మహిళా ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించలేదు.

Also Read: ప్రభాస్ ను ఢీకొట్టనున్న కమల్ హాసన్

ఇప్పుడు కీర్తి మరో మహిళా ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో జరగనుంది. కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని కూడా అంటున్నారు. ఈ సినిమాలో నటుడు సుహాస్ ఒక ముఖ్యమైన పాత్ర లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: అసంతృప్తిలో మెగా ఫ్యాన్స్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -