Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ సినిమాకు ఓకే చెప్పిన కీర్తి సురేష్

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ.. ఆడవాళ్లు మీకు జోహార్లు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన జోడిగా రష్మిక నటించగా.. సీనియర్ హీరోయిన్లు రాధిక శరత్‌ కుమార్‌, ఖుష్బూ సుందర్‌, ఊర్వశిలు కీలక పాత్రల్లో నటించారు. నెక్స్ట్‌ మూవీతోనైనా హిట్ కొట్టాలని భావిస్తున్న శర్వానంద్ కోసం దర్శకుడు కృష్ణ చైతన్య కథను సిద్ధం చేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట కృతి శెట్టిని సంప్రదించింది. అయితే కృతి అందుకు నో చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్. ఈ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర పోషించాల్సి ఉండడంతోనే ఉప్పెన భామ నో చెప్పిందట. కెరీర్ ప్రారంభంలో మదర్ రోల్స్ చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కృతి శెట్టి నో చెప్పిన పాత్రను మహానటి కీర్తి సురేశ్‌ ఓకే చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా యువ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు.. చెల్లి, తల్లి పాత్రలు చేసేందుకు అంగీకరించరు.

అయితే కీర్తి మాత్రం అందుకు భిన్నంగా మంచి ప్రాజెక్టులు వస్తే వదులుకోవడం లేదు. ఏలాంటి పాత్ర అయిన సరే.. మంచి, భిన్నమైన స్క్రిప్ట్‌ అయితే చాలు చేస్తానంటోంది. పెద్దన్న సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలుగా కీర్తి నటించింది. అలాగే భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవికి కూడా సోదరిగా కనిపించనుంది. గతేడాది ‘పెంగ్విన్’ సినిమాలో కూడా కీర్తి ఒక బిడ్డకి తల్లిగా కనిపించింది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారువారి పాట’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మెగా హీరోతో బన్నీ హీరోయిన్

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -