సినిమాలకు అనువైన సీజన్ సంక్రాంతి. కాని ఈసారి సంక్రాంతికి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదనే చేప్పాలి.సంక్రాంతి తరువాత సినిమాలకు అనువైన సీజన్ సమ్మర్. ఈసారి సమ్మర్ మరింత రసవత్తరంగా మారనుంది. ఈ సమ్మర్ బరిలో పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను,అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ,ఈ సమ్మర్కు రిలీజ్కు రెడీగా ఉన్నాయి.ఇక్కడ మరోకటి ఉంది , ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27నే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు ఒక్కే రోజు రిలీజ్ అయితే కలెక్షన్ల విషయంలో తేడాలు వస్తాయి అని సిని విశ్లేషుకుల భావన.
దీనిపై రెండు సినిమాల టీంలకు మధ్య సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు ఎవరూ తగ్గలేదు. మహేష్ బాబు మార్కెట్తో పోలిస్తే అల్లు అర్జున్ మార్కెట్ చాలా తక్కువ.థియెటర్ల విషయంలో కుడా క్లాష్స్ వస్తాయి.రకరకాల ప్రయత్నాల తరవాత రాజీ కుదిరిందని తెలుస్తోంది. రెండు సినిమాల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూడాలన్నది లేటెస్ట్ ప్లాన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను బట్టి ఎవరు ముందు రావాలి ఎవరు వెనుక రావాలి అన్నది డిసైడవుతారు. ఇదే టైంలో సూపర్ స్టార్ రజనీ సినిమా 2.0 కూడా రిలీజయ్యే అవకాశముంది. అయితే 2.0 రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.