Sunday, April 28, 2024
- Advertisement -

మహేష్ తో తేజు జత కట్టేసినట్లే….

- Advertisement -

మల్టీస్టారర్ చిత్రాలు చేయాలంటే… వెంకటేష్ మాత్రమే కాదు. నేను కూడా ఉన్నానంటున్నాడు . మహేష్ బాబు దానిలో భాగంగానే తేజుతో సినిమాకు సై అనేశాడు. ఇప్పుడిదే టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రిన్స్ సాయిధరమ్ తేజుతో జతకట్టి సినిమా చేయడమనే విషయం మాములు మ్యాటర్ కాదు. అసలు మా హీరో అతనితో చేస్తానని ఎలా కమిటయ్యాడా అని ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ తెగ వర్రీ అయిపోతున్నారు.

ఇక్కడ టంగ్ స్లిప్ అవ్వడమనేది తెలిసి జరిగిందా అనుకోకుండా మొహమాటానికి జరిగిందా అనేది తెలియాలంటే.. మనం దిల్ రాజు మనవడు అర్చిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ జోలికి పోవల్సిందే. ఈ ఈవెంట్ కు మహేష్ ,సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు హాజరయ్యారు. అలాగే దిల్ రాజు గ్రూప్ కు చెందిన వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ లు కూడా అటెండ్ అయ్యారు. వీరంతా అర్చిత్ ను బ్లెస్ చేయడానికి వచ్చారు. ఆ టైమ్లోనే డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. మల్టీస్టారర్ ప్రస్తావనను కదిపాడట. ఎందుకంటే ఇతగాడు చేసిన చిత్రాలలో మల్టీస్టారర్ సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి.

మెగా మేనల్లుడితో మల్టీస్టారర్ లో చేస్తారా అంటూ వంశీ పైడిపల్లి మహేష్ ను గిల్లేసరికి అప్పటికప్పుడు.. ‘మీరు కథ తీసుకురండి.. నేను ఎందుకు చెయ్యను చెప్పండి’ అనేశాడట మహేష్. దీనిపై రియాక్ట్ అయిన సాయి ధరం తేజ్ ‘నేను కూడా రెడీ అన్నా’ అంటూ చెప్పేశాడు. ఇది సరదాకు అన్నప్పటికీ… కచ్చితంగా దిల్ రాజు,వంశీ పైడిపల్లి కలిసి మంచి కథతో ప్రిన్స్ ను అప్రోచ్ కావచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -