Thursday, May 16, 2024
- Advertisement -

భరత్ అను నేను….. నెగిటివ్ ప్రచారం ఆ స్థాయిలో చేస్తున్నారా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అను నేను సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. శ్రీమంతుడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్‌బాబు, శివలు కలిసి చేస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా టాప్ రేంజ్‌లో జరిగింది. అయితే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచీ మాత్రం ఈ సినిమాపై ఒక పద్దతి ప్రకారం నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

టీజర్, ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌లో చాలా భాగం నారా చంద్రబాబునాయుడికి సూటిగా తగులుతున్నాయన్నమాట నిజం. హామీలు ఇచ్చి నిలబెట్టుకోనివాడు మనిషే కాదు అన్న డైలాగ్ అయితే పచ్చ బ్యాచ్ జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. విషయం మొత్తాన్ని నరేంద్రమోడీపైకి నెట్టేద్దామని చూసినా చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీలతో సహా నిరుద్యోగ భృతిలాంటివేవీ అమలు కావడం లేదు అన్నది కంటికి కనిపిస్తున్న సత్యం. అందుకే హామీ నిలెబట్టుకోలేనివాడు మనిషే కాదు అన్న డైలాగ్ సినిమాలో తీసేయాలని చెప్పి కూడా కొరటాలపై ప్రెషర్ తెచ్చారు. ఇక ఈ సినిమా బాగాలేదు అన్న ప్రచారాన్ని కూడా చాప కింద నీరులా చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన బాద్షా, టెంపర్ లాంటి సినిమాల విషయంలో నెగిటివ్ ప్రచారం చేసిన పచ్చ బ్యాచ్ జనాలే ఇప్పుడు భరత్ అను నేను అనే సినిమాపై కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా సాక్షిగా తెలిసిపోతూనే ఉంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఓ వసుమతి సాంగ్‌లో మహేష్ బాబు డ్యాన్స్ యావరేజ్‌గా ఉండడాన్ని కూడా ప్రస్తావిస్తూ సినిమా పోయినట్టే అని పచ్చ జనాలు ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే భరత్ అను నేను యూనిట్ మాత్రం సినిమాపై పూర్తి నమ్మకంతో ఉంది. కథాబలం ఉన్న సినిమా కావడంతో ప్రచార జిమ్మిక్కులు వాడాల్సిన అవసరం లేదు అనిపించింది అని …..అసలు సత్తా థియేటర్‌లోనే తెలుస్తుందని కొరటాల సన్నిహితులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -