Tuesday, April 30, 2024
- Advertisement -

సౌత్‌లో నెం 1 హీరోగా నిలిచిన మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడ‌ని అంద‌రికి తెలిసిందే.త‌న సినిమాలకు సంబంధించిన విష‌యాలను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు తెలియ‌జేస్తుంటాడు మ‌హేశ్‌.తాజాగా మహేశ్ బాబు మరో ఘనత సాధించాడు. మహేశ్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నవారి సంఖ్య తాజాగా 70 లక్షలకు చేరుకుంది. 2010లో మహేశ్ బాబు ఈ అకౌంట్ ను ప్రారంభించారు.

తాజాగా 70 లక్షల ఫాలోవర్లతో మహేశ్ హీరోలు ధనుష్, అల్లు అర్జున్ లను దాటేశాడు. ప్రస్తుతం మ‌హేష్ మ‌హర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. తమ హీరోకు ట్విట్టర్ లో భారీగా ఫాలోయింగ్ రావడంపై మహేశ్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -