Monday, May 13, 2024
- Advertisement -

‘భరత్‌ అనే నేను’ పూర్త‌వ‌గానే 25వ సినిమా

- Advertisement -

బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య‌మంత్రి వెంట‌నే త‌న ప‌నిని పూర్తి చసుకునే ప‌నిలో ప‌డ్డాడు. అంటే ప్రిన్స్ మ‌హేశ్‌బాబు ఇటీవ‌ల ముఖ్య‌మంత్రిగా ‘భరత్‌ అనే నేను’ సినిమాలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సినిమా ప్ర‌మాణ‌స్వీకారం డైలాగ్‌లు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు విడుద‌ల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ నెలాఖరున వేస‌విలో ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు వార్త ఏంటంటే ఈ సినిమా వెంట‌నే త‌న మ‌రో సినిమాను వెంట‌నే సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నాడు. ‘భరత్‌ అనే నేను’ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే తన 25వ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఏప్రిల్‌లో షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. అశ్వనీదత్‌, దిల్‌ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో జ‌రుగుతుందని స‌మాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -