Friday, May 3, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు ప్రొడక్షన్ బృందం పై మహేష్ బాబు ఆగ్రహం…

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. తాను చేసే సినిమాల్లో మహేష్ బాబు కేవలం నటన మాత్రమే కాకుండా డైరెక్షన్ మరియు ప్రొడక్షన్ పనుల్లో కూడా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ని గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.

చిత్ర బృందానికి షూటింగ్ లోకేషన్లలో మంచి తిండి మరియు వసతులు లేకపోవడం వల్ల మహేష్ బాబు కూడా హర్టయ్యారట. పైగా ప్రొడక్షన్ బృందం చిత్ర బృందానికి మినరల్ వాటర్ కాకుండా ట్యాప్ వాటర్ ఇచ్చినందుకు మహేష్ బాబు ప్రొడక్షన్ వారితో గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద నటీనటులకు మాత్రమే మినరల్ వాటర్ ఇచ్చి మిగతా వారికి షూటింగ్ సెట్స్ లో ట్యాప్ వాటర్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో కోపం తెచ్చుకున్న మహేష్ బాబు ప్రొడక్షన్ వారితో అందరికీ మంచి వసతులు లభించే లాగా చూడమని కోరారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -