టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత చాలా సైలెంట్గా ఉంటారు.తన ఫ్యామిలీ తప్ప పెద్దగా ఎవరిని పట్టించుకోదు.మరి అలాంటి నమ్రతకు ఓ ఫుడ్ డెలివెరీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పూర్తి వివరాల్లో వెళ్తే…జొమాటో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఇది కూడా ఒకటి. జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని, తిరిగి ప్యాక్ చేసి డెలివెరీ చేశాడు. ఈ నిర్వహం మొత్తం కెమెరాలో బంధించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోపై చూసిన నమత్ర తన కోపాన్ని ఆపులేక ట్వీట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేసి ఆ సంస్థని కడిగిపారేసింది.
”ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు.కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది..? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా..? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే..” అంటూ తన ట్వీట్టర్లో పోస్ట్ చేసింది నమ్రత.మరి ఎవరికి అయిన ఇలానే ఉంటుంది కదా.సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న దీనిపై జొమాటో సంస్థ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
