మళయాళ సింగర్ మంజూష మోహన్(27) రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందారు. గతవారం మంజూష తన స్నేహితురాలు అంజనతో కలిసి అంగమలై అనే ప్రాంతంలో స్కూటీలో ప్రయాణం చేస్తోంది.ఈ నేపథ్యంలో వారికి ఎదురుగా వచ్చిన వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన మంజూషను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాన్ రాంగ్ రూట్ లో రావడం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.2009 లో జరిగిన ఐడియా స్టార్ సింగర్ తో పాపులర్ అయిన మంజూష శ్రీ శంకరాచార్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో డిగ్రీ పొందింది. ప్రియదర్శన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. మళయాళ ఫేమస్ సింగర్లలో మంజూష మోహన్ కూడా ఒకరు.ఆమె మరణంపై మళయాళ సినీ ఇండస్ట్రీ సంతాపం తెలిపింది.