- Advertisement -
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా నవాబ్. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ఇలా భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
తెలుగు ట్రైలర్ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. టాప్ స్టార్స్తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.