- Advertisement -
భారతీయ సినీ పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సినిమాలు నిరూపించాయి. తాజాగా అలాంటి ఓ మలయాళ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా రూ.100 కోట్ల రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మంజుమ్మేల్ బాయ్స్..యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. షాహిర్, శ్రీనాథ్ బాసిల్, బాలు వర్గేసి నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకురాగా మళయాళ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ వసూళ్లు రాబట్టింది.
మళయాళ సినీ ఇండస్ట్రీలో రూ.100 కోట్లు రాబట్టాయంటే అది మామూలు విషయం కాదు.