Monday, May 13, 2024
- Advertisement -

ర‌వితేజ‌తో క‌ల్యాణ్‌కృష్ణ సినిమా

- Advertisement -

‘రాజా ది గ్రేట్‌’ సినిమా హిట్‌తో త‌న ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ వేగాన్ని పెంచారు. ఇక సినిమాలపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ర‌వితేజ నటించడానికి ఒప్పుకున్నార‌ట‌. ఈ ముచ్చ‌ట‌ను రవితేజ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక బృంద ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన క‌ల్యాణ్ కృష్ణ కూడా మంచి క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌ని ఆలోచిస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలు డిఫ‌రెంట్ స్టోరీల‌తో వ‌చ్చి విజ‌యాలు అందుకున్నాయి.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ చిత్రానికి విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాశీఖన్నా, సీరత్‌ కపూర్ హీరోయిన్లుగా కథానాయికలు. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -