Thursday, April 18, 2024
- Advertisement -

దిల్‌రాజుతోనే సినిమా హిట్‌

- Advertisement -

ముచ్చ‌ట‌గా మూడోసారి ఎస్వీసీలో

ప్ర‌స్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడికి మంచి బ్యాన‌ర్ శ్రీవెంక‌టేశ్వ‌ర్ క్రియేష‌న్స్ నిలుస్తోంది. ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌కు మంచి సినిమాలు అందించే వేదిక‌గా దిల్ రాజు బ్యాన‌ర్ నిలుస్తోంది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో న‌టించిన సినీన‌టులు, సినిమాలు తీసిన ద‌ర్శ‌కులు తెలుగు తెర‌లో రాణిస్తున్నారు. ఇప్పుడు రాజు గోల్డెన్ హ్యాండ్‌గా మారాడు.

తన బేనర్‌లో హిట్ ఇచ్చిన దర్శకుడిగా దిల్ రాజు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. వేణు శ్రీరామ్ మొద‌టి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ దిల్‌రాజు బ్యాన‌ర్‌లో తీశాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. అయినప్పటికీ అతడితోనే ‘ఎంసీఏ’ తీశాడు. ఇది కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. వేణు శ్రీరామ్‌కు మంచి హిట్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ దిల్‌రాజుతోనే ప‌ని చేస్తానంటున్నాడు.

తొలి హిట్ కొట్టాక వేణు శ్రీరామ్ మ‌రో సినిమాను దిల్ రాజుతో చేస్తున్నాడ‌ట‌. ‘ఎంసీఏ’ విడుదలయ్యాక రాజు తనకు ఫోన్ చేసి అభినందించాడని.. ఇదే బేనర్‌లో తన మూడో సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడని వేణు వెల్లడించాడు. ‘ఓ మై ఫ్రెండ్’ ఆడకపోయినా.. తన మీద నమ్మకంతో మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజుకు రుణపడి ఉంటానని కృత‌జ్ఞ‌త వ్య‌క్తం చేస్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -