Sunday, April 28, 2024
- Advertisement -

సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి సై రా నరసింహ రెడ్డి అనే సినిమా షూటింగ్, మరియు డబ్బింగ్ పనులు ముగించుకున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆయన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వం లో ఉండబోతుంది అనే విషయం ఈ పాటికే అందరికీ తెలుసు. ఈ సినిమా గురించి మీడియా లో ఈ మధ్య కాలం లో విపరీతం గా వార్తలు వచ్చాయి. ఈ సినిమా ని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ మీద మాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి సంయుక్తం గా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

కాకపోతే చిరంజీవి మాత్రం తాను షూటింగ్ కి రెడీ అని, ఈ నెల రెండో వారం నుండే షూటింగ్ మొదలు పెట్టుకోమని ఆదేశాలు జారీ చేశారట. చిరంజీవి సై రా విడుదల వరకు ఆగుతారు అని అంతా భావిస్తే ఆయన మాత్రం షూటింగ్ కి రెడీ అనే సంచలన నిర్ణయం ప్రకటించి చిత్ర యూనిట్ ని ఆశ్చర్యపరిచారు. ఇక అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ జులై రెండో వరం లో హైదరాబాద్ లో మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -