- Advertisement -
టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ భార్య బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మొహమ్మద్ షమీ భార్య హసీన్ ఒకప్పుడు మోడల్, ఐపీఎల్లో చీర్ గర్ల్గా కూడా పని చేసింది. అంజాద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫత్వా’ సినిమాలో ఆమె నటించనుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఓ జర్నలిస్టుగా హసీన్ నటించబోతోంది.
హసీన్ బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుతు తన కూతురుని పోషించడానికి కొంత సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల్లో నటించాలనుకుంటున్నానని తెలిపింది. అయితే గతంలో మొహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. షమీ అమ్మాయిల వ్యసనపరుడని,మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఇలా తన భర్తపై ఆరోపణలు చేసింది. అయితే వీరిద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.