సన్నీలియోన్ పేరు వింటేనే కర్ణాటక ప్రభుత్వం హడలిపోతుంది. కర్ణాటకలో ఎలక్షన్స్ కన్న ముందే హీట్ పుట్టిస్తుంది సన్నీ.విషయం ఏమిటంటే కర్ణాటక ప్రభుత్వం న్యూ ఇయర్ పార్టీలకు సన్నీలియోన్ ఎంట్రీని నిషేధించేసింది. సన్నీ గనుక బెంగళూరులో అడుగుపెడితే మాస్ సూసైడ్సే అని కొంతమంది కన్నడీగులు హెచ్చరించారు.మొన్న ఆ మధ్య సన్నీలియోన్ ఫోటోకి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారం ప్రాంతీయ తత్వాన్నో, హిందుత్వాన్నో అల్లుకుంటుంది అని కాంగ్రెస్ సర్కారు భయపడింది.
సన్నీలియోన్ బెంగళూరు ఎంట్రీని నిషేధించడం పట్ల కన్నడ సినిమా వాళ్లే అభ్యంతరం చెప్పారు. సన్నీలియోన్ నైట్ ను భద్రతా కారణాల రీత్యా రద్దుచేసి ఉంటే ఫర్వాలేదు, అలాకాకుండా కల్చర్, అంటే మాత్రం సహించేది లేదని శాండల్వుడ్ వాళ్లు స్పష్టం చేశారు.సన్నీని సినీ నటిగా గౌరవిస్తాం అని కన్నడ పరిశ్రమ చేప్పుకోచ్చింది.ఇంత పబ్లిసిటీ వచ్చేసరికి ఈ అవకాశాన్ని వదలకూడదని పార్టీ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే వీళ్లు హైకోర్టుకు వెళ్లారు.సన్నీ ప్రోగ్రామ్ పై నిషేధం తగదని, ఆమె అటెండ్ అయ్యే న్యూ ఇయర్ పార్టీకి భద్రత కల్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించాలని వీళ్లు కోర్టును కోరారు. చూద్దాం సన్నీ నైట్ ప్రోగ్రాం ఇంకా ఎంత దూరం వెళ్లుతందో.