Sunday, April 28, 2024
- Advertisement -

మ‌హానాయ‌కుడుపై నాదెండ్ల షాకింగ్ కామెంట్స్‌

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కి న మ‌హానాయకుడు చిత్రంపై మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు స్పందించారు. తాను సినిమాను చూడ‌లేద‌ని.. కానీ సినిమాను చూసిన‌వారంతా త‌న‌నే విల‌న్‌గా అనుకుంటున్నార‌న్నారు. ఎన్టీఆర్ వారసులు తీసిన సినిమా విషయంలో అంతకన్నా ఎక్స్ పెక్ట్ చేయడానికి ఏమీ లేదు అని నాదెండ్ల వాపోయారు. అసలు విలన్ చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు. నిజాలు చెప్పేంద ధైర్యం వారికి లేదంటూ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా అప్ప‌టి ప‌రిస్థితుల‌ను మ‌రోసారి గుర్తు చేశారు నాదెండ్ల‌. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులే అని.. ఎన్టీఆర్ ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనక‌న్నారు. ఆయన తిండికంటూ కొంత సొమ్మును త‌న ద‌గ్గ‌ర ఉంచుకుంటే ఆ విషయంలోనూ కోర్టుకు వెళ్లారని.. ఆయన ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి హింసించారని అన్నారు. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాకా.. మళ్లీ ఆయన చుట్టూ చేరార‌న్నారు.

సినిమాలతో నిజాలను మార్చలేరన్నారు నాదెండ్ల‌. ఈ సినిమా విషయంలో తను నోటీసులు పంపించినట్టుగా.. నాదెండ్ల తెలిపారు. అయితే అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి.. ఏ వ్యవస్థా వారిని ఆపలేదు అని అభిప్రాయపడ్డారు. వాళ్లు ఇందుకు ప్రతిఫలం అనుభవించ‌క త‌ప్ప‌ద‌న్నారు నాదెండ్ల‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -