- Advertisement -
అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహనటిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.అయితే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవుడు నాగచైతన్య నటించారు.సినిమాలో నాగేశ్వరరావు పాత్రపై రీసెంట్గా స్పందించారు నాగ చైతన్య.తాతగారి పాత్రలో నన్ను నటించమని నాగ్ అశ్విన్ అడిగినప్పుడు చాలా కంగారుపడ్డాను.
నాన్న ఒప్పుకోరేమో అని నాగితో చెప్పాను. తాతగారి పాత్రలో నటించడానికి తొలుత భయపడినా మొత్తానికి చేసినందుకు సంతృప్తిగా ఉంది. నేను కాకుండా మరొకరు చేసి ఉంటే బాధపడుతూనే ఉండేవాడిని. సినిమాలో నిజమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా స్వీకరిస్తారని ‘మహానటి’తో మరోసారి నిరూపితమైందని చైతు వివరించారు.