పెళ్లయి రెండు నెలలు కాలేదు. పెళ్లి కార్యక్రమాలే దాదాపు 40 రోజులు జరిగాయి. ఇక తీరిగ్గా హనీమూన్కు వెళ్తారనుకుంటే వారిద్దరూ మాత్రం సినిమా ప్రపంచంలో మునిగిపోయారు. తమ సినిమాలు పూర్తి చేసుకునే పనిలో దిగిపోయారు. వారిద్దరే అక్కినేని నాగచైతన్య, సమంత. వీరిద్దరి పెళ్లి హిందూ, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగింది. రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఇలా కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి దాదాపు 40 రోజులయ్యాయని అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక హనీమూన్కు వెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఇద్దరు దంపతులు సినిమాలతో బిజీ అయిపోయారు.
చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి సినిమాలో చైతు నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటుడు మాధవన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక సమంత అయితే మూడు సినిమాలతో బిజీబిజీగా మారింది. రాంచరణ్ సరసన రంగస్థలంలో నటిస్తోంది. ఇంకోటి తమిళంలో కూడా పచ్చజెండా ఊపింది. ఈ విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ చేస్తున్న సినిమాలు పెళ్లికి ముందు ఒప్పుకోన్నవేనట. ఆ సినిమాలు పూర్తి చేయడానికి దాదాపు నాలుగు నెలలు అవుతుందట. ఆ సినిమాల పూర్తి తర్వాత ఇక హ్యాపీగా ఓ ఆరు నెలల పాటు వారిద్దరూ ఓ టూర్ వెళ్తారని టాక్. ఈ విధంగా పెళ్లి తర్వాత కూడా వారిద్దరి అండర్స్టాండింగ్ సూపర్గా ఉంది. ఆ విధంగా దూసుకెళ్తూ సక్సెస్ఫుల్ సినీజంటగా ఉండాలని ఆశిద్దాం.