Saturday, April 20, 2024
- Advertisement -

రైల్వేస్టేషన్‌లో స‌మంత,నాగ‌చైత‌న్య‌

- Advertisement -

అక్కినేని నాగచైత‌న్య‌,ఆయ‌న భార్య హీరోయిన్ స‌మంత రైల్యే స్టేష‌న్‌లో టికెట్ కోసం క్యూలో నిల‌బ‌డ్డారు.అదేంటి నాగచైత‌న్య‌,స‌మంతలు రైల్యేస్టేష‌న్‌లో వెయిట్ చేయ‌డం ఏంటీ అనుకున్నారు అంత‌.త‌రువాత కాసేప‌టికి అటు నుంచి ద‌ర్శ‌కుడు షాట్ ఓకే అన‌డంతో అంద‌రికి సీన్ అర్థం అయింది.ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌,స‌మంత‌లు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గోపాలపట్నం సింహాచలం రైల్వేస్టేషన్‌లో సోమవారం హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రికరించారు.తెల్ల‌వారుజామున కావ‌డంతో జ‌నం తాకిడి కాస్తా త‌క్కువుగానే ఉంది.

సమంత సింహాచలం రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా, నాగచైతన్య ఆమెకు భర్తగా నటిస్తున్నారు. నాగచైతన్య ఆమెను రైల్వేస్టేషన్‌కు బైక్‌పై తీసుకురావడం, సమంత హుటాహుటిన టికెట్‌ కౌంటర్‌లోకి వెళ్లి టికెట్లు ఇవ్వడం.. వంటి సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు.స‌మంత,నాగ‌చైత‌న్య‌లు పెళ్లి త‌రువాత క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై అంద‌రికి ఆసక్తి నేల‌కొంది.ఇక ఈ సినిమా రెండు జ‌న్మ‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం.షూటింగ్‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి వ‌చ్చే స‌మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -