టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అప్ కమింగ్ మూవీస్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు. రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అక్బర్ అమర్ ఆంటోనీ’ , నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. మాస్ మహారాజ్ రవితేజ త్రిపాత్రభినయం చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా నటిస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత ఈ చిత్రంతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తుంది ఇలియాన. నాగచైతన్య, హ్యాట్రిక్ డైరెక్టర్ చందు మొండేటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేస్తున్నట్టు మైత్రీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈ రెండు సినిమాలు తమకు హిట్లు ఇస్తాయని భావిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.