అక్కినేని నాగచైతన్య ఎప్పటి నుంచో మాస్ హీరోగా ట్రై చూస్తునే ఉన్నాడు.కాని అతను మాస్ లీడర్గా ప్రయత్నించిన ప్రతిసారి చైతుకు నిరాశే ఎదురైంది.చైతన్య మాస్ సినిమాలు అన్ని ఫెయిల్ కావడం,ఇదే సమయంలో చైతు నటిచిన లవ్ & ఫ్యామిలీ సినిమాలు హిట్ కావడంతో చైతు మాస్ సినిమాలు కన్నా ఫ్యామిలీ సినిమాలు చేస్తేనే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి.అయితే వీటిని పట్టించుకోకుండా చైతు ముందుకి వెళ్తున్నాడు.చాలా రోజుల తరువాత అక్కినేని హీరో నాగ చైతన్య సవ్యసాచి అనే మాస్ ,డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే టాక్ ను బట్టి సినిమా విజయం ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.
ఇకపోతే ప్రస్తుతం సినిమాకు సంబందించిన సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. యాక్షన్ అండ్ రొమాంటిక్ తరహాలో రానున్న ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. సెన్సార్ యూనిట్ నుంచి కూడా చిత్ర యూనిట్ కు మంచి ప్రశంసలు అందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని అంటున్నారు. ఇక చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా మాధవన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి నవంబర్ 2న విడుదల చేస్తున్నారు.