- Advertisement -
నాగచైతన్య తాజాగా నటిస్తున్న సినిమా సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వం ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్,టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమాను నిర్మించారు.
విభిన్నమైన ఈ కథాంశం కొత్తగా వుండి అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనున్నట్టు చెబుతున్నారు.ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, మాధవన్ ప్రతినాయకుడిగా నటించాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా నాగచైతన్యకు మరో హిట్ ఇస్తుందుమో చూడాలి.