Tuesday, April 23, 2024
- Advertisement -

బాల‌య్య‌పై మ‌రోసారి సెటైర్ వేసిన నాగ‌బాబు

- Advertisement -

ఓ ప‌క్క నంద‌మూరి – మెగా ఫ్యామిలీ యంగ్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌లు ఎటువంటి ఇగోలు లేకుండా క‌లిసి ప‌ని చేస్తుంటే మ‌రో ప‌క్క సీనియ‌ర్లు అయి ఉండి ఒక‌రిపై మ‌రోక‌రు సెటైర్లు వేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ మ‌ధ్య హీరో బాలకృష్ణ‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ వివాదం మొద‌లైంది.మొదట బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని కామెంట్స్ చేశారు నాగ‌బాబు. తిరిగి బాల‌కృష్ణ వంటి గొప్ప కామెడియ‌న్‌ను తెలియ‌ద‌ని చెప్ప‌డం నా త‌ప్పే అంటూ బాల‌కృష్ణ‌పై సెటైర్స్ వేశారు నాగ‌బాబు. ఈ గొడ‌వ కాస్తా స‌ర్ధుమ‌ణిగింది అనేకునే లోపు మ‌ళ్లీ బాల‌య్య‌పై క‌విత్వంతో సెటైర్ వేశాడు నాగ‌బాబు.

రీసెంట్ గా బాలయ్య చెప్పే మా జాతి, మా రక్తం డైలాగులను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు నాగ‌బాబు. దీనికి సంబంధించిన తన ఫేస్ బుక్ పేజీలో ఓ కవిత పోస్ట్ చేశాడు. కట్టు కథలు, కల్పనలు, నిజం కక్కలేని ఈ బయోపిక్కులు మాకొద్దంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.ఈ కవిత ద్వారా బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై విమర్శలు గుప్పించాడు నాగబాబు.ఈ క‌వితపై అభిమానుల తలో రకంగా స్పందిస్తున్నారు.మ‌రి ఈ క‌విత ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

https://www.facebook.com/NagaBabuOfficial/photos/a.281553372035503/950489125141921/?type=3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -