Sunday, May 12, 2024
- Advertisement -

నాగార్జున‌తో త‌మిళ హీరో ద‌ర్శ‌క‌త్వం

- Advertisement -

త‌మిళ హీరో ద‌ర్శ‌క‌త్వంలో ఓ తెలుగు సీనియ‌ర్ న‌టుడు న‌టించ‌నున్నాడు. ఈ విష‌యం రెండు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యంగా మారింది. త‌మిళ హీరో ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున న‌టిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో నటుడిగా కాకుండానే ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొదుతున్నాడు ధనుశ్. అత‌డు తెలుగు, త‌మిళంలో క‌లిపి ఓ సినిమాను రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను త‌మిళంలో కూడా విడుద‌ల చేయ‌డం సాధార‌ణ‌మే.

‘పవర్‌ పాండి’ అనే సినిమాతో ధ‌నుశ్ దర్శకుడిగా మారి ఆక‌ట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో త్వరలోనే ఆయన నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నార‌ని స‌మాచారం. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. తేనాండాల్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుశ్‌ కూడా ముఖ్య పాత్రలో న‌టించ‌నున్నారు. ఆగస్టులో షూటింగ్ మొదలు పెడ‌తారంట‌.అప్ప‌ట్లో నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి త‌మిళంలో ‘తోళా’గా విడుద‌లై సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. అప్ప‌టి నుంచి త‌మిళంలో నాగార్జునపై అంద‌రి దృష్టి ప‌డింది. ఈ నేప‌థ్యంలో ధనుశ్‌, నాగార్జున కాంబినేషన్ రాబోతోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -