Sunday, May 5, 2024
- Advertisement -

బాల‌య్య మ‌ళ్లీ తాత‌య్యాడు.. త‌ల్ల‌యిన రెండో కూతురు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ కుటుంబంలో ఆనందం నిండింది. బాల‌య్య‌బాబు మ‌ళ్లీ తాత‌య్యాడు. పెద్ద మనవడు దేవాన్ష్‌కు తోడు ఇంకొడు వ‌చ్చాడు. బాల‌కృష్ణకు ఇద్ద‌రు కూతుళ్లు. వాళ్లే బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని. ఇప్ప‌టికే బ్రాహ్మ‌ణికి దేవాన్ష్ జ‌న్మించాడు. ఇప్పుడు చిన్న కూతురు తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది. గీతం విశ్వ‌విద్యాల‌య వ్యవస్థాపకుడు ఎంఎస్పీ రామారావు మ‌న‌వ‌డు శ్రీభరత్‌తో తేజ‌స్విని వివాహం 2013లో జరిగింది. వీరి దాంప‌త్య జీవితం ఐదేళ్ల త‌ర్వాత మొదటి సంతానం కలిగింది. మగబిడ్డకు జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది.

వ్యాపారవేత్తగా కొనసాగుతున్న శ్రీభరత్-తేజస్విని జంట ఎక్క‌డ క‌నిపించ‌దు. వాళ్ల వ్యాపారం చూసుకుంటూ జీవితం గ‌డుపుతున్నారు. బాల‌కృష్ణ మ‌ళ్లీ తాత కావ‌డంతో అభిమానులు, ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 2018 బాల‌కృష్ణ‌కు బాగా క‌లిసొచ్చింది అని చెప్ప‌వ‌చ్చు. జైసింహ సినిమా హిట్ పొందాడు. ఇప్పుడు మ‌న‌వ‌డుతో బాల‌య్య సంతోషంలో ఉన్నారు.

భుజానికి చికిత్స చేసుకున్న అనంత‌రం బాల‌కృష్ణ‌ పూర్తిగా కోలుకున్నారు. త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై తీసే సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -