బిగ్బాస్ రెండో సీజన్లో సెలబ్రిటీల హడావిడి ఎక్కువైంది.మొదటి సీజన్తో పోలిస్తే రెండో సీజన్లో హౌస్కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చి వెళ్లారు.గత వారం విజయ్ దేవరకొండ బిగ్బాస్ హౌస్కి వచ్చి తెగ హంగామా సృష్టించాడు.ఇక వారమే యాంకర్ అనసూయ బిగ్బాస్ హోస్లోకి వచ్చి కంటెస్టెంట్స్తో ఆడిపాడింది.ఇక బిగ్బాస్ హోస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు నీవెవరో చిత్ర యూనిట్.
ఆది పినిశెట్టి. తాప్సీ, రితికా సింగ్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న నీవెవరో సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా నీవెవరో సినిమా హీరో,హీరోయిన్లు ఆది పినిశెట్టి. తాప్సీ, రితికా సింగ్ బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు.హౌస్మెట్స్తో సరాదా కాసేపు గడిపి.తమ సినిమా విశేషాలను వాళ్లతో పంచుకున్నారు.నీవెవరో మూవీ టీం వచ్చిన ఎపిసోడ్ని ప్రొమో రూపంలో విడుదల చేశారు బిగ్బాస్.