ఇప్పుడంతా సోషల్ మీడియాదే హవా. కొంచెం పాపులర్ అయితే చాలు కొద్దికాలంలోనే సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. 7 ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బోల్డ్ కంటెంట్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది సరయు. ఈ పాపులారిటీతో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 5లో అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయ్యి బయటికివచ్చేసినా..తన యూట్యూబ్ చానల్ కు మరింత పాపులారిటీ తెచ్చుకోగలిగింది.
తాజాగా సరయూతో పాటు ఆమె బృందంపై హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం లఘు చిత్రం రూపొందించి ..గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఆ వీడియోలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించింది.
వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే ఉందంటూ…రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల పోలీసులు.. ఫిలింనగర్లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు కేసు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలియా మనసులో ఉన్న ఆ హీరో ఎవరు ?